PDPL: ధర్మారం మండలంలోని నంది మేడారం శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఇవాళ ఉదయం నుంచి పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ పరాభవ నామ సంవత్సరానికి శుభాకాంక్షలు పలుకుతూ పూజలు చేశారు. సంవత్సరం పొడవునా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పురోహితులు గజవెల్లి ప్రభాకర్ స్వామివారికి అభిషేకం నిర్వహించారు.