MDCL: బోడుప్పల్ సర్కిల్ పరిధి చెరువులు, నీటి మడుగుల్లో పెరిగిన గుఱ్ఱపు డెక్క మొక్కలను యంత్రాలతో తొలగిస్తున్నారు. ఇది “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగమని డిప్యూటీ కమిషనర్ శైలజ తెలిపారు. పీర్జాదిగూడ చెరువులో పనులు ప్రారంభించి, దోమల నివారణకు గంబూసియా చేపలను వదిలారు. ఈ కార్యక్రమంలో డీఈఈ కె.జహ్నవి శశాంక పాల్గొన్నారు.