NTR: అమరావతి రాజధాని అభివృద్ధి పనులకు సంబంధించి సీఆర్డీఏ అవసరాలపై బుధవారం జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ లక్ష్మీశ నిర్వహించారు. ఈ సమావేశంలో రాజధాని ప్రాంత నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ ఇతర నిర్మాణ సామగ్రి నిరంతర సరఫరా కల్పనపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సాధించాలన్నారు. ఇప్పటివరకు సుమారు 11 లక్షల టన్నుల నిర్మాణ సామగ్రికి అనుమతులు జారీ అయ్యాయని తెలిపారు.