JGL: మల్యాల మండలంలోని రైతులు యాసంగి రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని AO చంద్ర దీపక్ తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు కొత్త పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన రైతులు దరఖాస్తు ఫారంతో పాటు, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాకు చెందిన జిరాక్స్ కాపీలను మండల వ్యవసాయ కార్యాలయంలో అందజేయలన్నారు.