NDL: డోన్ జాతీయ రహదారిపై ఓబుళాపురం మిట్ట వద్ద కారు డివైడర్ను ఢీకొట్టింది. హైదరాబాద్కు చెందిన భార్గవ్ కుటుంబంతో కలిసి టూర్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్గవ్ భార్య, కూతురు యశస్వి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.