కృష్ణా: పామర్రులోని ఫ్లై ఓవర్ వద్ద ఎస్సై విజయ భాస్కర్ రోడ్డు భద్రత గురించి వాహనదారులకు మంగళవారం అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ వినియోగం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.