KRNL: ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘రైతన్న మీకోసం వారోత్సవాలు’ కార్యక్రమంలో భాగంగా కోసిగి మండలం కడదొడ్డిలో జరిగిన కార్యక్రమంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. రైతులను కలుసుకుని రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ.. వారి సమస్యలను తెలుసుకున్నారు. పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.