AP: NTR జిల్లాలో ఆర్గానిక్ రైతు ఉత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఆర్గానిక్ వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు. రైతులు వాళ్ల ఉత్పత్తులను వాళ్లే మార్కెట్ చేసేలా.. ఈ పోర్టల్ ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. కొనుగోలుదారులు, రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని, ఆర్గానిక్ ఉత్పత్తిలో జిల్లాను నెం.1గా చేస్తామన్నారు.