SKLM: జిల్లాలో వాహన చోరీలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాహన చోరీలపై అందిన ఫిర్యాదులపై తక్షణమే కేసులను నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. గత ఏడాదిలో 103 ద్విచక్ర వాహనాల దొంగతన కేసులు నమోదు అవ్వగా వాటిలో 72 కేసులు ఛేదించినట్లు తెలిపారు.