కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత వారం ఆరోగ్య పరీక్షల నిమిత్తం సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. అన్ని పరీక్షల తర్వాత ఆమె ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆసుపత్రి మేనేజ్మెంట్ బోర్డ్ ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 3గంటల సమయంలో ఆమె డిశ్చార్జ్ అయినట్లు ఆయన చెప్పారు.
ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. గతవారం సోనియా గాంధీ సాధారణ పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారు.సోనియా వెంట తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. సోనియాగాంధీ గత కొద్ది రోజులుగా కొవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా బారిన పడిన అనంతరం వివిధ అనారోగ్య సమస్యలు సోనియాగాంధీని చుట్టుముట్టాయి.