కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుక అట్టహాసంగా సాగింది. ‘పుష్ప 2’ ప్రభంజనం సృష్టించి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (అల్లు అర్జున్), ఉత్తమ దర్శకుడు (సుకుమార్) అవార్డులను గెలుచుకుంది. నివేదా థామస్ (35: చిన్నకథ కాదు) ఉత్తమ నటిగా నిలిచింది. అమితాబ్ బచ్చన్ ఉత్తమ సహాయ నటుడిగా, తేజ సజ్జా, కాజల్ అగర్వాల్ క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటీనటులుగా అవార్డులు అందుకున్నారు.