MDCL: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్య శాస్త్రం, కంప్యూటర్ అప్లికేషన్స్ శాఖల ఆధ్వర్యంలో ‘ఏఐ ఇన్ బిజినెస్’ స్వల్పకాలిక సర్టిఫికేట్ కోర్సును ప్రిన్సిపాల్ డా. కె.విజయ్ కుమార్ ఇవాళ ప్రారంభించారు. సమన్వయ కర్తలుగా డా.సత్యనారాయణ, డా.యమునారాణి వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఆధునిక ఉపాధి అవకాశాలకు ఇది ఎంతో ఉపయోగకరమని, ఈ కోర్సు వారం రోజులపాటు ఉంటుందని ఆయన తెలిపారు.