TG: హైదరాబాద్ గన్పార్క్ వద్దకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సహా BRS నేతలు చేరుకున్నారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అలాగే, BRS సభ్యులు పింక్ కలర్ దుస్తులతో అసెంబ్లీ సమావేశాలకు హాజరకానున్నారు. త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తుందని, 6 గ్యారంటీలు, రైతులు, నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తామని కేటీఆర్ అన్నారు.