SKLM: నరసన్నపేట మండలం వైఎస్ఆర్ జంక్షన్ మారుతీ నగర్ రోడ్డులో ఇసుక కుప్ప, సిమెంటు పలకలు రోడ్డుపై అడ్డుగా ఉన్నాయి. నిత్యం వాహనదారులు అక్కడ టైర్ స్లిఫ్ అయ్యి పడిపోతున్నారు. పంచాయతీ సిబ్బంది ఎవరికి వారే యమునా తీరే మాదిరిగా.. కనీస పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నరసన్నపేట మేజరు పంచాయతీ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.