BHNG: ఆలేరు మండలం బహదూర్ పేట గ్రామంలో కురుమ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుళ్ల చంద్రశేఖర్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కర్రె సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా బిక్షపతి, కోశాధికారిగా బాలయ్య బాధితులు చేపట్టారు. కార్యవర్గ సభ్యులుగా శేఖర్ వెంకటేష్ ఉన్నారు. ఈ ఎన్నికలు బీరప్ప గుడి ఆవరణంలో పెద్ద కురుమ ఐలయ్య, సిద్ధులు ఆధ్వర్యంలో నిర్వహించారు.