NZB: బాల్కొండ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘ నూతన కార్యవర్గాన్ని ఆదివారం సాయంత్రం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడిగా అందే వెంకట గిరి, ఉపాధ్యక్షుడిగా భూస రత్నాకర్, సెక్రటరీగా మ్యాక నాగేశ్, కోశాధికారిగా కుందారం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. పద్మశాలిల అభివృద్ధికి కృషి చేస్తామని నూతన సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, కుల పెద్దలు పాల్గొన్నారు.