AKP: నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో ఆదివారం బోనాల ఊరేగింపు ఘనంగా జరిగింది. కొత్త అమావాస్య పండుగను పురస్కరించుకుని మహిళలు గ్రామదేవత నూకాంబిక అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి 108 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.