MBNR: మిడ్జిల్ మండలం వెలుగోములలో గ్రామపంచాయతీలో ఆదివారం మల్టీపర్పస్ వర్కర్లను సర్పంచ్ సువర్ణమ్మ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామాభివృద్ధిలో వారి సేవలను సర్పంచ్, కార్యదర్శి వినీల కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మమ్మ, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.