SDPT: కుకునూరుపల్లి మండల పరిధిలోని చిన్నకిష్టాపూర్ గ్రామ క్రాస్ రోడ్డు వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ నిర్మించాలని కోరుతూ మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ.. త్వరలోనే నిధులు మంజూరు చేసి, శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.