అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ మునియా నాయక్ మాట్లాడుతూ.. వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే మోసాలకు గురికాకుండా ఉంటారని సూచించారు. తెలుగు అధ్యాపకురాలు బి. శివమ్మ సమాజ అభివృద్ధిలో వినియోగదారుల చైతన్యం కీలకమని తెలిపారు.