PPM: తోటపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో గల మొక్కజొన్న, అరటి తోటల్లో ఇవాళ ఉదయం ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రైతులు, పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపించినప్పుడు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.