MDK: కుల్చారం మండలం రాంపూర్ వద్ద నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొట్టెల వేడుకకు వెళ్లి బైక్పై వస్తుండగా జరిగిన ప్రమాదంలో అమృత్ గౌడ్(50), ఆయన కుమారుడు రిషివర్ధన్ (14), అల్లుడు సాయాగౌడ్(32) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రిషివర్ధన్ పుట్టినరోజు వేడుకలు మొన్ననే జరుపుకోగా, మరుసటి రోజే విగతజీవిగా మారడంతో తల్లి యాదమ్మ రోదనలు మిన్నంటాయి.