SRCL: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి గ్రామంలో వెలిసిన క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవ స్వామివారిని వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు శనివారం దర్శించుకున్నారు. కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.