కడప: జిల్లాలో వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం, వ్యక్తిత్వ హననమే రాజకీయంగా చేసుకుంటున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ అంశంపై తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.