కృష్ణా: జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఈవో సుబ్బారావు తెలిపారు. శనివారం బందరులో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 148 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 21,296 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.