KRNL: ఎమ్మిగనూరు పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైందని, ఆచూకీ తెలిస్తే రూరల్ పీఎస్కు సమాచారం ఇవ్వాలని ఎస్సై కె.శ్రీనివాసులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం మహిళ బట్టలు ఉతకడానికి గుడేకల్లు దగ్గరలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పక్కన గల కాలువ వద్దకు వెళ్లిందన్నారు. బట్టలు ఉతుకుతూ కాలువలో పడి చనిపోయిందని తెలిపారు.