SRD: కంగ్టిలోని లక్ష్మణ సమేత సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 51వ వార్షికోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో మహాగణపతి పూజ, పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. గోపాల్ మహారాజ్ ఆధ్వర్యంలో శ్రీ రామనామ భిక్ష కార్యక్రమం చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, గురువర్యుల ఆశీస్సులు పొందారు.