జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇవాళ నిర్వహించిన పదో తరగతి తెలుగు పరీక్షకు 11 మంది రెగ్యులర్ విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి కె.రాము తెలిపారు. 12,684 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా, 12,673 మంది (99.91%) హాజరైనట్లు వెల్లడించారు. సప్లిమెంటరీ విద్యార్థులు 12 మందికి 12 మంది (100%) హాజరైనట్లు తెలిపారు.