MNCL: అధికార పార్టీపై బురదజల్లడం అలవాటుగా మారిందని MLA వినోద్ శనివారం ప్రకటనలో మండిపడ్డారు.ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వారు, దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు, PA లపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా మాట్లాడటం సరికాదన్నారు.