BDK: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా నూతన కమిటీని శనివారం ఇల్లందు మండలం ధర్మపురంలో జరిగిన మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా బొగ్గారపు వెంకన్న, ఉపాధ్యక్షులుగా మెంతిని కొండలరావు, ప్రధాన కార్యదర్శిగా ఎనగంటి చిరంజీవి, సహాయ కార్యదర్శిగా జోగ కాంతారావు, కోశాధికారిగా నరసింహారావులతో పాటు మరో ఏడుగురు సభ్యుల్ని ఎన్నుకున్నట్లు వెల్లడించారు.