సత్యసాయి: విజయవాడలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నేతృత్వంలో బీసీ రక్షణ చట్టంపై శనివారం మంత్రుల సమావేశం జరిగింది. బీసీల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించేలా బీసీ రక్షణ చట్టాన్ని రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. కులం లేదా వృత్తి పేరుతో దూషించినా, సాంఘిక బహిష్కరణలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేలా చట్టం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.