NLG: మూసీ మురికి జలాలతో నల్గొండ ప్రజలు పడుతున్న నరకయాతనను ప్రతిపక్షాలు స్వయంగా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. హయత్నగర్లో రోడ్డు విస్తరణ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కలుషిత నీటి వల్ల ప్రజలు 35 ఏళ్లకే 60 ఏళ్ల వృద్ధుల్లా మారిపోతున్నారన్నారు. కిడ్నీ, క్యాన్సర్ వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.