KMR: కామారెడ్డి శివారులో రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణం గుండా జాతీయ రహదారి ఉన్నందున, పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా రింగ్ రోడ్డు ఆవశ్యకతను వివరించారు.