ASR: అరకులోయ మండలం సిర్గాం పంచాయతీ లంతంపాడు గ్రామంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డా. కంబిడి కృష్ణకుమారి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులతో సమావేశమై పలు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల హక్కులు, ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అనంతరం గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు.