AP: రాష్ట్రంలో మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా అణచివేస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రౌడీషీటర్లపై డ్రోన్లతో నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నేరాలు తగ్గినప్పటికీ, కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. నెల్లూరు తరహాలోనే అన్ని జిల్లాల్లో రౌడీ ముఠాలను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు శాఖను ఆదేశించారు.