BHPL: జంగేడు ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షా కేంద్రాన్ని శనివారం కలెక్టర్ రాహుల్ శర్మ స్వయంగా సందర్శించారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా జరుగుతున్న తీరు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలు లేకుండా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.