MDCL: సూరారం (M) పరిధిలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను ఏసీపీ బాల గంగిరెడ్డి శనివారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. సూరారం పీఎస్ పరిధిలో జరుగుతున్న పరీక్షల సరళిని, భద్రతా ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఏసీపీ వెంట సూరారం సీఐ సుధీర్ కృష్ణ పాల్గొన్నారు.