E.G: జనసేన పార్టీ 13 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్ అత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక దేవిచౌక్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టారు. శనివారం ఉదయం చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్ర రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ గంటా స్వరూపరాణి హాజరై ఆహారాన్ని పంపిణీ చేశారు.