విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ఈనెల 16న జీడి మామిడి రైతులతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు బీ రాంబాబు తెలిపారు. శనివారం గజపతినగరంలో ఆయన మాట్లాడుతూ.. ఉచిత పంటల బీమా ప్రభుత్వమే అమలు చేయాలని, 2024 -25 బీమా పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరసన గోడ పత్రికను విడుదల చేశారు.