PLD: నరసరావుపేట ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా, ఇన్ పేషంట్లతో వైద్యం సక్రమంగా జరుగుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్ పరిసరాల పరిశుభ్రత వాతావరణంపై ఆరా తీశారు. డాక్టర్లు అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె కోరారు.