నక్సలిజం నుంచి దేశం విముక్తి పొందుతున్నట్లే.. చొరబాటుదారులను ఏరివేయడం కూడా సాధ్యమేనని కేంద్రమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా.. రాబోయే ఐదేళ్లలో దేశం నుంచే తొలగిస్తామని చెప్పారు. ‘గతంలో రాహుల్ అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని చెప్పారు కానీ, చేయలేదు. ఎందుకంటే వారే ఆ పార్టీకి ఓటు బ్యాంకు’ అని షా ఆరోపించారు.