AP: గుంటూరు జిల్లా అత్తోట గ్రామ రైతు రోశయ్యపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్నారని కొనియాడారు. ’80 ఏళ్ల వయసులో కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ నెలకు రూ.20 వేలకు పైగా ఆర్జిస్తున్న రోశయ్య విజయగాధ స్ఫూర్తిదాయకం. 2016లో తీసుకున్న చర్యలతో ప్రేరణ పొంది రోశయ్య సాధిస్తున్న విజయాలు ఆదర్శం’ అని పేర్కొన్నారు.