TG: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విధానాన్ని రద్దు చేసి, నర్సరీ నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్య కిందకు తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు, ఉచితంగా లేదా 50% రాయితీతో రవాణా సౌకర్యం కల్పించనున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విధానం ద్వారా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే ఈ మార్పు ప్రధాన లక్ష్యం అని తెలిపారు.