TPT: శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 15న పుష్పయాగం నిర్వహించనున్నారు. ఉదయం స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం పుష్పయాగం జరుగుతుందని అధికారులు తెలిపారు. 14వ తేదీ నుంచి ఆలయంలో టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. పుష్పయాగం కారణంగా మార్చి 15న నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసినట్లు వెల్లడించారు.