ప్రకాశం: ఒంగోలులోని ఆర్టీసీ డిపోలో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసినట్లు మార్కాపురం ఆర్టీసీ మేనేజర్ గురువారం ఒక ప్రకటనలు తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్లచే 40 రోజులు శిక్షణ ఇస్తారని, రూ.20వేలు, జీఎస్టీ రూ.3600 చెల్లించాల్సి ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం హెవీ లైసెన్స్ కలిగి ఉంటే ఆర్టీసీ రిక్రూట్మెంట్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.