GDWL: కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఈ నెల 23న జిల్లాకు రానున్నారు. దీంతో ఇవాళ జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రోటోకాల్, భద్రతలో ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా చూడాలని ఆదేశించారు. హెలిపాడ్ నుంచి ఆలయం వరకు ఉన్న రహదారులను యుద్ధప్రతిపాదికన సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకమని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన హెచ్చరించారు.