‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘కిల్లర్’. ఈ సినిమాతో ఆమె వెండితెరపై హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తాజాగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. Sci-Fi థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జ్యోతి ఐదు పాత్రలలో నటిస్తుండటం విశేషం.