MBNR: హన్వాడ మండల కేంద్రంలోని మసీదులో బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందుకు DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగను ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని కాంక్షించారు. హిందూ ముస్లిం మధ్య ఐక్యత ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.