నల్గొండ: మర్రిగూడ మండలం ఖుదాబాక్షపల్లిలో సర్పంచ్ పందుల జయలక్ష్మి పాండు అధ్యక్షతన శనివారం మొదటి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు పలు సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వార్డు సభ్యులు, ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.