NRML: జిల్లా పొట్టపల్లి (కె) ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి, విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల భవన మరమ్మత్తులను త్వరగా పూర్తి చేయాలని, మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతతో అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతం పెంచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.